Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు : బీజేపీ కిషన్ రెడ్డి ధ్వజం

టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు : బీజేపీ కిషన్ రెడ్డి ధ్వజం
, ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (11:35 IST)
File
FILE
కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదని, సగటు రాజకీయ పార్టీనేనంటూ తెలంగాణ బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెనుకేసుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తెలంగాణ విషయంలో బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు.

కష్టమైనా, నష్టమైనా బీజేపీ వెనకడుగు వేయలేదన్నారు. కానీ, కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఇక ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu