Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిరణ్‌ కుమార్ రెడ్డి ఈ ఎన్నికలలో పోటీ చేయడంలేదు...

కిరణ్‌ కుమార్ రెడ్డి ఈ ఎన్నికలలో పోటీ చేయడంలేదు...
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (19:53 IST)
FILE
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కిరణ్ శనివారం ఉదయం చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేస్తారని అనుకుంటే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పరిచయం చేస్తూ పోటీకి నిలబెడుతున్నట్లు ప్రకటించారు. తన సోదరుడిని వెంటబెట్టుకుని వెళ్లి పీలేరులో నామినేషన్ దాఖలు చేశారు.

మరోవైపు జగన్ మోహన్ రెడ్డికి పట్టున్న కడప జిల్లాలోని రాజంపేట బిజెపి లోక్ సభ అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి శనివారం ఉదయం నామినేషన్ వేశారు. పురంధేశ్వరి నామినేషన్ సందర్భంగా బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడుతోపాటు పలువురు తెలుగుదేశం, బిజెపి నాయకులు హాజరయ్యారు. నామినేషన్ వేయడానికి ముందు పురంధేశ్వరి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu