Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిరణ్ 'జై సమైక్యాంధ్ర' పార్టీకి షాక్: అజ్ఞాతంలోకి నటి హేమ!

కిరణ్ 'జై సమైక్యాంధ్ర' పార్టీకి షాక్: అజ్ఞాతంలోకి నటి హేమ!
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (17:49 IST)
FILE
మాజీముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డికి ప్రముఖ టాలీవుడ్ నటి హేమ షాకిచ్చారు. తాను జైసమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించిన ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆమె ప్రకటించడంతో జైసపా కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రత్యర్థి పార్టీలకే కాకుండా తమ పార్టీకి కూడా సినీగ్లామర్ తోడవడంతో పార్టీకి ఎంతగానో కలిసివస్తుందనుకున్నారు. కానీ ఇపుడు ఆ పార్టీ నేతల ఆశలు అడియాశలయ్యాయి. తాను పోటీ చేస్తానని హేమ ప్రకటించిన కొద్దిసేపటికే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఆమె జైసపా తరపున పోటీ చేస్తారని తెలియడంతో చిత్ర పరిశ్రమ ప్రముఖుల నుంచి హేమపై ఒత్తిడి పెరగడంతో ఆమె వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. చివరకు హేమ తన సెల్‌ఫోన్‌ను కూడా స్వీచాఫ్ చేశారు. అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఆశీస్సులతో హేమ శనివారం నామినేషన్ వేయాలనుకున్నట్లు సమాచారం. కాగా హేమ తమ పార్టీ నుంచి పోటీ చేస్తే ఎంతగానో కలిసివస్తుందని భావించిన ఆ పార్టీ నేతల ఆశలు అడియాశలయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu