Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్... 5 సంతకాలపై చిరు

సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్... 5 సంతకాలపై చిరు
, శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (15:17 IST)
WD
సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో శుక్రవారం కేంద్రమంత్రి జైరాం రమేష్, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కొన్ని కీలక అంశాలను జోడించి విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఆనం తదితర నాయకులు హాజరయ్యారు. మేనిఫెస్టో విడుదల అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడుతూ... టిడిపి, వైకాపాలను నమ్మవద్దనీ, వారి మేనిఫెస్టోలను కూడా విశ్వసించవద్దని కోరారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దోచుకుంటాడని విమర్శించారు.

ఇంకా చిరంజీవి మాట్లాడుతూ, అనుభవజ్ఞుడు ఆనం రాంనారాయణరెడ్డి తయారుచేసిన ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో ఎన్నో అంశాలు పొందుపరిచామని అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ చరిత్రలో లేదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత 5 సంతకాలతో సీమాంధ్రను మార్చేస్తానని చెపుతున్నాడనీ, కానీ ఆ 5 సంతకాలతో పంచభూతాలను అమ్మేస్తారని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu