Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు టీడీపీ టిక్కెట్‌పై పోటీ!!

బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు టీడీపీ టిక్కెట్‌పై పోటీ!!
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (16:28 IST)
FILE
భారతీయ జనతా పార్టీకి చెందిన రఘురామ కృష్ణంరాజు గురువారం తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై నర్సాపురం లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ నుంచి బీజేపీలో చేరిన ఆయనకు టికెట్ దక్కకపోవడంతో తాజాగా చంద్రబాబును కలిశారు. ఈ మేరకు బాబు టికెట్ కేటాయించడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

వాస్తవానికి టీడీపీ బీజేపీకి మధ్య కుదిరిన సీట్ల ఒప్పందంలో భాగంగా బీజేపీకి కేవలం నాలుగు ఎంపీ సీట్లను మాత్రమే టీడీపీ కేటాయించింది. దీంతో అనేక మంది బీజేపీ నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులపై టీడీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు.. ఆ పార్టీకి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే, ఇక్కడు బీజేపీకి రఘురామకృష్ణంరాజు టీడీపీకి టిక్కెట్‌పై పోటీ చేయనుండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu