Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్‌కు షాక్: నర్సరావుపేట నుంచి కాసు కృష్ణారెడ్డి పరార్!!

కాంగ్రెస్‌కు షాక్: నర్సరావుపేట నుంచి కాసు కృష్ణారెడ్డి పరార్!!
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (13:35 IST)
File
FILE
కాంగ్రెస్ నేత, మాజీమంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఆయనకు నర్సరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ కేటాయించగా, ప్రస్తుత పరిస్థితుల్లో తాను అక్కడ నుంచి పోటీ చేయలేనంటూ చేతులెత్తేశారు.

ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ... తాను పోటీ చేయలేననే విషయాన్ని పిసిసికి చెప్పానని, గత్యంతరం లేదంటే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. నర్సరావుపేట శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేయలేనని కాసు వెంకటకృష్ణా రెడ్డి తనయుడు మహేష్ రెడ్డి బుధవారంనాడే చెప్పిన విషయం తెల్సిందే.

కాగా, సీమాంధ్రలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమకు కేటాయించిన అసెంబ్లీ స్థానాల నుంచి తప్పుకోగా కాసు ఇలా షాక్ ఇవ్వడం కాంగ్రెస్‌ను విస్మయం పరిచే అంశం. ఇప్పటికే ఆయన కుమారుడు కాసు మహేష్ కూడా అసెంబ్లీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu