Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికల తర్వాత చంద్రబాబు ఉండడు : జగన్ మోహన్ రెడ్డి

ఎన్నికల తర్వాత చంద్రబాబు ఉండడు : జగన్ మోహన్ రెడ్డి
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (15:12 IST)
File
FILE
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో టీడీపీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులు ఉండరని వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మారలేదన్నారు. అధికారం కోసం నోటికొచ్చిన హామీలిస్తున్నారని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.

తాను చంద్రబాబులా అబద్ధాలు చెప్పనని, విశ్వసనీయత అనే పదానికి అర్థం కూడా బాబుకు తెలియదన్నారు. రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులుగా పని చేసినా ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి చిరస్మరణీయుడై ఉన్నారని జగన్ గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu