Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరీంనగర్‌లో సోనియా గాంధీ ప్రసంగం 45 నిమిషాలే!!

కరీంనగర్‌లో సోనియా గాంధీ ప్రసంగం 45 నిమిషాలే!!
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (12:43 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా తెలంగాణాలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైన తర్వాత సోనియా బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. అయితే బుధవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంగా జరిగే కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభలో ఆమె పాల్గొని 45 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.

అయితే, తెలంగాణ ఏర్పాటుతో పాటు భవిష్యత్‌లో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కూడా సోనియాగాంధీతో ఇక్కడ నుంచి ప్రకటన చేయించే దిశగా ఆ ప్రాంత నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు భారీ సంఖ్యలో జనసమీకరణ చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu