Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణప్పురంకు చెందిన రూ.15 కోట్ల విలువైన గోల్డ్ సీజ్

మణప్పురంకు చెందిన రూ.15 కోట్ల విలువైన గోల్డ్ సీజ్
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (10:02 IST)
File
FILE
మణప్పురం ఫైనాన్స్ కంపెనీకి చెందిన 15 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మణప్పురం ఫైనాన్స్ సంస్థ కు చెందిన ఈ బంగారాన్ని సరైన పత్రాలు లేకుండా తరలిస్తుండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా బుధవారం చెక్ పోస్టు వద్ద వచ్చిన వాహనాలను తనిఖీ చేయగా.. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu