Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిలిచి మరీ మందు తాగించారు, మత్తులో రేప్ చేశారు...!

పిలిచి మరీ మందు తాగించారు, మత్తులో రేప్ చేశారు...!
, మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:04 IST)
FILE
ఓ వివాహితకు ఫుల్లుగా మద్యం తాగించి, ఆమె మత్తులో జారుకున్నాక వంతుల వారిగా రేప్ చేశాకు ఏడుగురు దుండగులు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం జంగమయ్యగారి పల్లె గ్రామంలో జరిగింది.

ఆమె వయస్సు 45 సంవత్సరాలు. ఓ రోజు పనుల నిమిత్తం పొలానికి వెళ్ళింది. అక్కడికి సమీపంలోని మాదిగలగుట్ట వద్ద కొందరు వ్యక్తులు మందు పార్టీ చేసుకుంటున్నారు. నాటుకోళ్ళు, మద్యంతో అక్కడి వాతావారణంతోపాటు మనుషులూ వేడెక్కారు. అదే సమయంలో ఈ మహిళ వారికంట పడింది.

మాంసం ఇస్తాం రమ్మంటూ పిలిచే సరికి మరేం ఆలోచించకుండా వారివెంట నడిచింది. అక్కడ మద్యం చూసేసరికి ఆమెకు నాలుక లాగింది. ఆమెకూ మద్యం తాగే అలవాటు ఉండడమే అందుక్కారణం. వారు అడిగీ అడగకముందే మందుకొట్టేసి మైకంలోకి జారుకుంది. ఇదే అదనుగా ఆ కామాంధులు ఆమెను ఆక్రమించుకున్నారు వంతులవారీగా.

కొద్దిసేపటికి సృహ వచ్చేసరికి ఓ వ్యక్తి ఆమెను అనుభవిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆరుగురు వ్యక్తులు రేప్ చేశారని, ఇప్పుడు తన వంతు అని ఆ కీచకుడు ఆమెతో చెప్పాడు. వెంటనే, అతగాడిని పక్కకునెట్టి పరుగు లంకించుకుందా వివాహిత. ఆమె వంటిపై నగలు కూడా వారు దోచుకున్నారట. ఈ వ్యవహారంపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పెద్ద మనుషుల చలవతో విషయం బయటే పరిష్కారమైందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu