Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పోలీసుల ఎదుట లొంగుబాటు!

జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పోలీసుల ఎదుట లొంగుబాటు!
FILE
సొంత సోదరుని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సోమవారం పాలమూరు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ హత్య కేసులో ఎర్ర శేఖర్ గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ వచ్చిన విషయం తెల్సిందే.

జూలై 17వ తేదీన ఎర్ర శేఖర్ సోదరుడు ఎర్ర జగన్మోహన్ (41) దేవరకద్ర పాత బస్టాండు సమీపంలో కారులో ఉండగా, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన ఆయనను కాల్చి చంపారు. ఈ హత్య అన్న ఎర్ర శేఖర్ చేయించారని ఆరోపణలు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తన భర్తను ఆయన సోదరుడు, ఎమ్మెల్యే ఎర్ర శేఖరే హత్య చేయించారని జగన్మోహన్ భార్య ఆశ్రిత అప్పట్లో ఆరోపించారు. అదేసమయంలో ఎర్ర శేఖర్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సోమవారం ఉదయం ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu