Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈనెల 25 నుండి చంద్రబాబు 'ఆత్మగౌరవ యాత్ర'... తెలంగాణలో...

ఈనెల 25 నుండి చంద్రబాబు 'ఆత్మగౌరవ యాత్ర'... తెలంగాణలో...
, గురువారం, 22 ఆగస్టు 2013 (20:15 IST)
WD
రాష్ట్రంలో యాత్రలు అధికమౌతున్నాయి. తాజాగా మరో యాత్రకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. ఈనెల 25వ తేదీ నుండి 'ఆత్మ గౌరవ యాత్ర' మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్టణం నుండి బస్సు యాత్రను ప్రారంభించాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో వారం రోజుల పాటు యాత్ర చేపట్టే విధంగా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నట్లు సమాచారం. కాని బాబు చేపట్టే ఆత్మగౌరవ యాత్రపై టిడిపి నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కేవలం సీమాంధ్రలో మాత్రమే బస్సు యాత్ర చేస్తే తెలంగాణ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని వారు సూచించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో బస్సు యాత్ర చేపట్టడం అంత భావ్యం కాదని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏమైనా బస్సు యాత్ర చేపట్టాలని బాబు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాబు పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu