Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్ర తొలి రాజధాని కర్నూలులో 'జై సమైక్యాంధ్ర' లక్ష గళ ఘోష

ఆంధ్ర తొలి రాజధాని కర్నూలులో 'జై సమైక్యాంధ్ర' లక్ష గళ ఘోష
, గురువారం, 22 ఆగస్టు 2013 (14:55 IST)
FILE
ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని, రాయలువారు ఏలిన ప్రాంతం కర్నూలులో జై సమైక్యాంధ్ర నినాదాలతో లక్ష గళ ఘోష మార్మోగింది. రాష్ట్ర విభజన వద్దు... సమైక్యమే ముద్దు అంటూ కర్నూలు జిల్లాకు చెందిన అన్ని పాఠశాలల విద్యార్థులు లక్షలాదిగా తరలివచ్చి చేపట్టిన లక్షగళ ఘోష కార్యక్రమం సమైక్య ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది.

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలుగు జాతి ఒక్కటే అనీ, జాతిని చీల్చేందుకు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షగళ ఘోష నేపధ్యంలో కర్నూలు నాలుగు కూడలి రోడ్డు జనసంద్రాన్ని తలపించింది.

Share this Story:

Follow Webdunia telugu