Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబును నమ్మే స్థితిలో ప్రజలు లేరు : ఎంపీ రాజయ్య

చంద్రబాబును నమ్మే స్థితిలో ప్రజలు లేరు : ఎంపీ రాజయ్య
, ఆదివారం, 1 జనవరి 2012 (13:26 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే స్థితిలో లేరని వరంగల్ ఎంపీ టి.రాజయ్య జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం వరంగల్‌లో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణను రాత్రికి రాత్రి అడ్డుకున్న ఘనుడు చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు. అందువల్ల చంద్రబాబును నిలదీసే హక్కు ఈ ప్రాంత ప్రజలకు ఉందన్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన జగన్‌కు కూడా ఇక్కడ పర్యటించే హక్కు లేదన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాతే తెలంగాణలో పర్యటించాలని రాజయ్య హెచ్చరించారు. లేకుంటే జగన్ పర్యటనలను సైతం అడ్డుకుంటామని రాజయ్య తెలిపారు. వీరంతా సమైక్యం ముసుగులో తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu