Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిష్టానం తప్పు తెలుసుకుంటే పార్టీలోనే ఉంటా: సబ్బం

Webdunia
గురువారం, 20 జనవరి 2011 (16:24 IST)
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికైనా స్పందించి ఎంపీలను ఢిల్లీకి పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ముఖ్యంగా పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెరదించి అధిష్టానం తప్పులను సరిచేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి తనకు అభ్యంతరమేమీ లేదని ఆయన చెప్పారు.

గురువారం సమావేశంలో పార్టీ పరిస్థితిని కూలంకషంగా తను వివరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో తను లేనట్లు అనుకోవడం పొరపాటని అన్నారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో తాము ఎన్నిక కాబడ్డామనీ, ఆయన కుమారునిగా వైఎస్ జగన్‌కు తాము మద్దతు పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే, దానికి కారణాలేమిటో పార్టీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments