Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజారాజ్యంలో ఏడుగురు ఎమ్మెల్యేలకు 'జగన్' 'గాలి' గాలం!!

ప్రజారాజ్యంలో ఏడుగురు ఎమ్మెల్యేలకు 'జగన్' 'గాలి' గాలం!!
ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పాటు.. కర్ణాటక మంత్రులు గాలి జనార్ధన్ రెడ్డిలు గాలం వేసినట్టు సమాచారం. దీంతో ప్రరాపా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం.

కొత్త మంత్రివర్గంలో చేరకుండా చిరంజీవిపై ఒత్తిడి తీసుకుని వచ్చేలా ఈ ఏడుగురు ఎమ్మెల్యేలను గాలి బ్రదర్స్ ప్రలోభాలకు గురి చేసినట్టు వినికిడి. కిరణ్ కుమార్ మంత్రివర్గంలో చేరితే ప్రరాపా నుంచి వైదొలుగుతామని హెచ్చరించడంతో చిరంజీవి అత్యవసరంగా కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కూలంకుషంగా చర్చించారు.

చిరంజీవికి హెచ్చరిక చేసిన వారిలో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, తెలంగాణ ప్రాంతానికి ప్రరాపా నేత మహేశ్వర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యేతో పాటు.. కృష్ణా జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. ప్రరాపాను మంత్రివర్గంలో చేరకుండా అడ్డుకుంటే ఏదోరూపంలో ఆదుకుంటామని గాలి బ్రదర్స్ వీరికి హామీ ఇచ్చినట్టు వినికిడి. ఆ మేరకు వారు చిరంజీవిపై ఒత్తిడి చేయడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu