Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాదాలతో దిగజారిపోతున్న రాష్ట్ర పాలన: నన్నపనేని

వివాదాలతో దిగజారిపోతున్న రాష్ట్ర పాలన: నన్నపనేని
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల వల్ల పరిపాలన నానాటికీ దిగజారిపోతోందని తెలుగుదేశం పార్టీ మహిళా సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు. దీనిపై ఆమె గుంటూరు విలేకరులతో మాట్లాడుతూ ముఠా తగాదాలు, వర్గ కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా ఉంటాయన్నారు.

వీటివల్ల ఏర్పడే అంతర్గత వ్యవహారాల కారణంగా ముఖ్యమంత్రి మార్పులు చేస్తోందన్నారు. దీంతో మంత్రి పదవుల కోసం పలువురు నేతలు ఢిల్లీలో పైరవీలు చేయడం సిగ్గుచేటన్నారు.
కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి మినహాయింపు అన్నారు.

ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ... సుస్థిర పాలన తెదేపాతోనే సాధ్యమన్నారు. కష్టకాలంలో తెదేపా ప్రజలకు అండగా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. అంతర్గత వివాదాలతో రాష్ట్రంలో పరిపాలను దిగజార్చుతున్న కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu