Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్ పార్టీలో జగన్ రైలు బోగీ కాదు.. రైలింజన్: నటి రోజా

కాంగ్రెస్ పార్టీలో జగన్ రైలు బోగీ కాదు.. రైలింజన్: నటి రోజా
కాంగ్రెస్ పార్టీ అనే రైలుకు కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక రైలు బోగీ లాంటి వ్యక్తి కాదని, ఆ రైలును ముందుకు కదిలించగలిగే రైలింజన్ అని తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా నేత, సినీ నటి ఆర్కే.రోజా అన్నారు. ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలను జగన్ శాసిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

జగన్ వంటి ప్రజాకర్షక నేతలు కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం దురదృష్టకరమన్నారు. దీనికి కొంతమంది సీనియర్ నేతలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే కాంగ్రెస్ అధిష్టానం ఆ విధంగా నడుచుకుందన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లక తప్పదన్నారు.

ఇకపోతే.. కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా కాంగ్రెస్ అనే రైలుకు జగన్ ఒక బోగీలాంటి వాడు కాదని, కాంగ్రెస్ అనే రైలుకు రైలింజన్ వంటివాడన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధోగతిపాలేనన్నారు. తెదేపా పరిస్థితి ఎటూ మీకు తెలుసునని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని రోజా అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu