బాంబే స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ సూచీ బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 118 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 22876 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ కూడా 25 పాయింట్ల మేరకు లాభపడి 6840 వద్ద ఆగింది.
ఈ ట్రేడింగ్లో ఎల్ అండ్ టి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు తదితర కంపెనీల షేర్లు లాభపడగా, టీసీఎస్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.