Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త పన్ను విధానంతో 60 శాతం ఆదా: ఆర్థిక మంత్రి

కొత్త పన్ను విధానంతో 60 శాతం ఆదా: ఆర్థిక మంత్రి
, శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (13:50 IST)
2010-11 సంవత్సర సాధారణ బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను రాయితీ వల్ల పన్ను చెల్లింపుదారులకు అరవై శాతం మేరకు పన్ను ఆదాకానుంది. విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయం 1.60 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

రూ.1.6 లక్షల నుంచి రూ.ఐదు లక్షల ఆదాయం కలిగిన వారు పది శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, రూ.ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం కలిగిన సంపాదనాపరులు 20 శాతం, రూ.ఎనిమిది లక్షల ఆదాయం పైబడిన వారు 30 శాతం మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

దీర్ఘకాలిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ కలిగిన వారి నుంచి 20 శాతం పన్ను వసూలు చేస్తారు. అలాగే, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ). డైరక్ట్ టాక్సెస్ కోడ్ విధానాన్ని ఏప్రిల్ 2011 సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu