Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెమన్ భార్య రహీన్‌కు రాజ్యసభ సీటివ్వండి సార్... ములాయంకు ఘోసీ లేఖ!

మెమన్ భార్య రహీన్‌కు రాజ్యసభ సీటివ్వండి సార్... ములాయంకు ఘోసీ లేఖ!
, శనివారం, 1 ఆగస్టు 2015 (12:07 IST)
ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ ఉరికంబం ఎక్కడంతో.. అతని భార్య రహీన్ ప్రస్తుతం నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో రహీన్ కూడా కొంతకాలం జైల్లో గడిపింది. ఆమె పాత్రపై ఆధారాల్లేకపోవడంతో కోర్టు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను రాజ్యసభ సీటివ్వాలని సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు మహ్మద్ ఫరూఖ్ ఘోసీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు లేఖ రాశారు. 
 
ఆ లేఖలో "నేను ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌‌కు లేఖ రాయకూడదు. ఇది సరైన సమయం కాదని కూడా తెలుసు. కానీ, పరిస్థితులు అలా ఉన్నాయి. ములాయంజీ మీరు నిస్సహాయులకు ఎల్లప్పుడు ఆసరాగా నిలుస్తారు. రహీన్ కూడా ఇప్పుడు నిస్సహాయురాలే. ఆమే కాదు, దేశంలోని ఎందరో ముస్లింలు ఇవాళ తాము నిస్సహాయులమని భావిస్తున్నారు. మనం తప్పకుండా రహీన్‌కు మద్దతుగా నిలవాలి. ఆమెను రాజ్యసభకు పంపడం ద్వారా ఆపన్నుల తరపున గళమెత్తుతుంది'' అని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu