Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ పేరు కొనసాగుతుంది... జైట్లీ స్పష్టం

ఎన్టీఆర్ పేరు కొనసాగుతుంది... జైట్లీ స్పష్టం
, బుధవారం, 26 నవంబరు 2014 (14:05 IST)
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కి తెలుగుతేజం స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడం పైన పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాగే ఈ అంశాన్ని పలు పార్టీలు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాజ్యసభలో ప్రస్తావించి తమ వాణిని వినిపించాయి. దీనికి రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిచ్చారు. ఎన్టీఆర్ పేరు కొనసాగుతుందని చెప్పారు.
 
ఇదే అంశంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్ పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదన్నారు. ఎయిర్ పోర్టు పేరును మార్చరాదని తెలంగాణ అసెంబ్లీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. ఎన్టీఆర్ పేరే కావాలనుకుంటే విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు పెట్టుకోవాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu