శెభాష్ నాయుడు... క్లిష్ట సమయంలో మీ పనితీరు సూపర్ : ప్రధాని మోడీ కితాబు

ఠాగూర్
సోమవారం, 8 డిశెంబరు 2025 (20:11 IST)
టీడీపీ లోక్‌సభ సభ్యుడు, కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. క్లిష్ట సమయంలో మంచి సమయస్ఫూర్తితో, సమర్థమంతంగా వ్యవహరించారంటూ కితాబిచ్చారు. ఇండిగో విమాన సర్వీసుల రద్దు సంక్షోభం సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రిగా రామ్మోహన్ నాయుడు విపక్ష సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి గట్టి మద్దతు లభించింది. క్లిష్ట సమయంలో సమర్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి పనితీరును ప్రధాని స్వయంగా అభినందించారు. 
 
ఇండిగో సమస్యపై రామ్మోహన్ నాయుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించారని, శాఖాపరంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. ప్రస్తుతం వస్తున్న విమర్శలు, ఆరోపణలు పట్టించుకోకుండా ముదుకు సాగాలని మంత్రి రామ్మోహన్‌కు ప్రధాని సూచించారు.
 
గత వారం రోజులుగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన వందలాది విమాన సర్వీసులు రద్దు కావడంతో దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయంతెల్సిందే. ఈ అంశంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ సంక్షోభంపై కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి రామ్మోహన్ నాయుడు సోమవారం రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ఈ తరుణంలో స్వయంగా ప్రధాని మోడీయే ఆయనను ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments