Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో మరో నిర్భయ... బస్సులో యువతిపై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (11:13 IST)
ఒడిశా రాష్ట్రంలో మరో నిర్భయ కేసు జరిగింది. 17 యేళ్ల యువతిని ఒక డ్రైవర్‌, కండక్టర్‌ బస్సులో సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. బాంకీ శివారుల్లోని మహానదిపై ఉన్న జాతముండియా వంతెన కింద ఒక యువతి మృతదేహాన్ని ఈ నెల 2న అర్థనగ్న స్థితిలో పోలీసులు కనుగొన్నారు. ఆమెను అత్యాచారం చేసి, హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. 
డ్రైవర్‌తో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన ఆ యువతి... తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ఆమెతో వివాహం ఇష్టం లేని డ్రైవర్‌ సంతోష్‌ సాహు.. హతమార్చాలని పథకం పన్నాడు. 'విహారానికి తీసుకెళ్తానని నమ్మించి అతాగఢ్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతమైన రతాగఢ్‌కు తీసుకెళ్లాడు. కండక్టర్‌ బిభూతీ రౌత్‌తో కలిసి బస్సులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం బస్సు చక్రాలను మార్చడానికి ఉపయోగించే రెంచితో తలపై పలుమార్లు తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ యువతిని గౌరంగాపూర్‌ వాసిగా గుర్తించారు. ఈ కేసులో బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments