Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ముందు శశికళ దిగతుడుపే... ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం: జయలలిత మేనకోడలు దీప

అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత మేనకోడలు దీప నోరు విప్పారు. జయలలిత స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ నటరాజన్‌పై దీప విమర్శలు గుప్పించారు. తన ముందు శశికళ దిగతుడుపేనని, అదేసమయంలో ప్రజాశ్రేయస్సే

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (08:41 IST)
అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత మేనకోడలు దీప నోరు విప్పారు. జయలలిత స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ నటరాజన్‌పై దీప విమర్శలు గుప్పించారు. తన ముందు శశికళ దిగతుడుపేనని, అదేసమయంలో ప్రజాశ్రేయస్సే తన లక్ష్యమని ఆమె ప్రకటించారు. పైగా, ''నేను మతాలకతీతం. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రమించడానికి వేచి ఉన్నాన''ని టీనగర్‌లోని తన నివాసం వద్దకు భారీగా చేరుతున్న అన్నాడీఎంకే శ్రేణులను ఉద్దేశించి ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం, ప్రజల కోసం శ్రమించడానికి తాను వేచి చూస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు నోటు పుస్తకంలో రాయాలని సూచించారు. వాటన్నింటినీ పరిశీలిస్తానని, అంతవరకు వేచి ఉండాలని కోరారు. తన పేరుతో పార్టీని ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయనీ, వాస్తవానికి ఈ విషయం తనకు తెలియదన్నారు. తాను ద్రావిడ లక్ష్య వాదినని పేర్కొన్నారు. అన్ని మతాలు తనకు ఒకటేనని, మతసామరస్యం తన లక్ష్యమని బదులిచ్చారు. సమాజ సంక్షేమానికి తన వంతు సేవలందించాలన్నదే తన ధ్యేయమని వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments