Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమర సైనికులు, స్వాతంత్య్ర సమర యోధులకు నివాళిగా ఆన్‌లైన్‌లో దాల్మియా భారత్ గ్రూప్ సంగీత కచేరీ

అమర సైనికులు, స్వాతంత్య్ర సమర యోధులకు నివాళిగా ఆన్‌లైన్‌లో దాల్మియా భారత్ గ్రూప్ సంగీత కచేరీ
, సోమవారం, 10 ఆగస్టు 2020 (18:37 IST)
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ ఆన్‌లైన్‌లో ఓ సంగీత కచేరీని నిర్వహించబోతుంది దాల్మియా భారత్ గ్రూప్.
 
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులతో పాటుగా మువ్వెన్నల భారత కీర్తి పతాకను రెపరెపలాడించేందుకు తమ ప్రాణాలనే అర్పించిన అమర వీరులకు నివాళులర్పించేందుకు 'జజ్బా-ఈ-భారత్' శీర్షికన ఈ సంగీత కచేరీని నిర్వహించబోతున్నారు. 
 
కోవిడ్-19తో పోరాటంలో దాల్మియా గ్రూప్ యొక్క స్ఫూర్తిని వేడుక చేయడంతో పాటుగా సంస్థ విలువలు, లక్ష్యం సైతం ఇది ప్రదర్శించనుంది. సుప్రసిద్ధ గాయకులు కైలాష్ ఖేర్, రిక్కీ కేజ్‌లు ఈ ఆన్‌లైన్ సంగీత కచేరీలో తమ గానామృతం వినిపించనున్నారు. ఈ సంగీత కచేరీని ఆస్వాదించేందుకు dblconcert.com వెబ్‌సైట్‌కు వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటుగా ప్రత్యక్షంగా తిలకించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో కరోనా సోకి డీఎస్పీ కన్నుమూత