Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయాలంటేనే రోత పుట్టింది: జస్వంత్

రాజకీయాలంటేనే రోత పుట్టింది: జస్వంత్
జిన్నాపై వ్యాఖ్యలు చేసి బహిష్కారానికి గురైన భాజపా నేత జస్వంత్ సింగ్ శనివారం హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... తనపై భాజపా సస్పెన్షన్ ఎత్తివేసినా తిరిగి ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజికీయాలంటేనే రోత పుట్టిందనీ, విలువలు... మాటకు కట్టుబడి ఉండటంవనేవి చుక్కాని వేసినా కనబడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

అసలు ఇపుడున్న రాజకీయ పార్టీలన్నీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయాయని, కనుక భవిష్యత్తులో ఏ పార్టీలోనూ చేరబోనని తెలిపారు. జిన్నాపై తాను చేసిన వ్యాఖ్యలలో ఎటువంటి తప్పులేదని సమర్థించుకున్నారు. దేశంలో హిందూ- ముస్లింల మధ్య నెలకొన్న మనస్పర్థలను అణదొక్కేందుకు తాను చేయవలసినదంతా చేస్తానని ఉద్ఘాటించారు.

గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్లపై మాట్లాడుతూ... దానికి పూర్తిగా భాజపాదే బాధ్యత అని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చమని అధిష్టానానికి సూచించినా వారు తన మాటను ఖాతరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu