సుకుమార మకరంద సుమాలతో సౌందర్యం..!
సుగంధ రాజా లిల్లీ: ముఖం మీద మెటిమలుంటే దీని పువ్వులను.. పసుపు, వెన్నతో కలిపి మెత్తగా నూరి ముఖానికి రాస్తే మొటిమల నివారణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.దాసాని (మందార) పుష్పం: తలవెంట్రుకలు పెరగడానికి, నల్లబడేందుకు దీని పువ్వుల రసం కొబ్బరినూనెతో సమపాళ్లలో కలిపి వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. పేనుకొరికిన చోట దీని పువ్వులను నలిపి రోజుకు రెండు, మూడుసార్లు రుద్దితే తిరిగి వెంట్రుకలు వస్తాయి.ఆముదం: ఆముదం, నూనె తలకు నిత్యం వాడితే వెంట్రుకలు దృఢంగా, నల్లగా పెరుగుతాయి.శ్రీగంధం: శ్రీగంధపు నూనెను, ఆవనూనెను కలిపి ముఖంపై రాస్తే మొటిమలు తగ్గిపోతాయి. శ్రీగంధం మంచి సువాసన కలిగి ఉంటుంది. పలాష-(మోదుగ): ముఖం మీద మొటిమలతో బాధపడేవారు దీని ఆకులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. వీటి ఆకులు గాయాలను మాన్పేందుకు బాగా పనిచేస్తాయి.కస్తూరి పసుపు: దీనిని నీటితో గంధంగా నూరిగాని మెత్తని చూర్ణాన్ని నీటిలో కలిపిగాని, ముఖానికి లేపనం వేస్తే నల్లమచ్చలు, వలయాలు పోయి ముఖ వర్చస్సు పెరుగుతుంది.గుంటగలగర: దీని రసంతో తయారుచేసిన తైలం తలకు రాసు కుంటే జుట్టు సమస్యలు, చుండ్రు మొదలగు సమస్యలు తగ్గుతాయి.ఉమ్మెత్త: దీని రసం జుట్టుకు మర్దించుట వలన పేనుకొరుకుడు తగ్గుతుంది. ముఖం మీది మచ్చలు నలుపుతనం పోయేందుకు పసుపును జిల్లేడు పాలతో నూరి పలుచగా పూయాలి.