Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లులతో క్షయ వ్యాధి... దూరంగా ఉండండి జాగ్రత్త....

పిల్లులతో క్షయ వ్యాధి... దూరంగా ఉండండి జాగ్రత్త....
, శనివారం, 29 మార్చి 2014 (14:42 IST)
FILE
చాలామందికి ఇంట్లో పిల్లులను పెంచుకునే అలవాటు ఉంటుంది. కొంతమందైతే ఆ పిల్లులను పక్కలో వేసుకుని నిద్ర కూడా పోతుంటారు. మరికొందరు కుక్కలను పెంచుకుని వాటిని పక్కలో వేసుకుని నిద్రపోతుంటారు. ఇలాంటి పెంపుడు జంతువులు వల్ల క్షయ వ్యాధి సోకే ప్రమాదం ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇటీవల పిల్లులను పెంచే ఓ కుటుంబంలో ఇద్దరు పిల్లలకు ఈ పిల్లుల ద్వారా టీబీ వ్యాధి సోకినట్లు వైద్యులు కనుగొన్నారు. న్యూబురీ, బెర్క్ షైర్ లో ఇద్దరు పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు. ఈ వ్యాధి పేరు బొవిన్ టీబీ. ఇలా పిల్లి నుంచి వ్యాధి మనిషికి సోకడం ఇదే తొలిసారనీ, కనుక ఇకపై పిల్లులను పెంచవద్దని వారు చెపుతున్నారు.

అసలు ఇలాంటి వ్యాధులు వస్తాయని తాము గతకొంత కాలంగా చెపుతున్నప్పటికీ పెడచెవిన పెట్టారనీ, అందువల్ల ఇప్పుడిది ప్రబలిందంటున్నారు. ఇది కనుక అశ్రద్ధ చేస్తే ఇతరులకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకని ఇప్పుడు బ్రిటన్లో ఇలాంటి రోగ లక్షణాలున్న పశువులేమైనా ఉంటే వాటిని అంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu