Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిల్క్ పౌడర్‌తో మైసూర్ పాక్ ఎలా చేయాలి?

మిల్క్ పౌడర్‌తో మైసూర్ పాక్ ఎలా చేయాలి?
FILE
పాలలో క్యాల్షియం శక్తి ప్రతిరోజూ పాలను తాగటం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించ వచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. అలాంటి పాలతో పిల్లలకు నచ్చే మిల్క్ మైసూర్ పాక్ ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దామా..?

కావలసిన పదార్థాలు :
చక్కెర - ఒక కేజీ
యాలుకల పొడి - 1 టీ స్పూను.
నీళ్లు - అర లీటరు.
నెయ్యి - 1 కిలో.
మిల్క్‌పౌడర్ (అమూల్) - 250 గ్రా.
మైదా - 250 గ్రా.

తయారీ విధానం:
ముందుగా మిల్క్ పౌడర్‌లో 150 గ్రాముల నెయ్యి వేసి మిశ్రమాన్ని కలిపి ఉంచుకోవాలి. వేరొక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి తీసుకుని సన్నని సెగపై తీగపాకం పట్టి మిల్క్ పౌడర్ ముద్ద, మైదా వరుసగా వేసి కలపాలి. వేరొక గిన్నెలో మిగిలిన నెయ్యి వేడి చేసి పంచదార, మిల్క్ పౌడర్ మిశ్రమంలో వేసి బాగా కలిపి ట్రేలో వేసి ఆరు గంటల పాటు ఆరబెట్టి కావలసిన సైజులో కట్ చేసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu