ప్రముఖ స్మార్ట్ఫోన్ ఉత్పత్తుల సంస్థ హెచ్టీసీ మరో మోడల్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హెచ్టీసీ వన్ సిరీస్లో వన్ ఎస్9 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధరను రూ.33700గా (499 యూరోలు)గా నిర్ణయించింది. ఈ ఫోన్ను యూరోపియన్ మార్కెట్కు అనుగుణంగా తయారు చేసి, కేవలం వెబ్సైట్లోనే అందుబాటులో యఉంచారు.
హెచ్టీసీ జర్మనీ వెబ్సైట్లో ఈ ఫోన్ను కంపెనీ ఫోన్ల జాబితాలో ఉంచారు. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వివరాలు వెల్లడించలేదు. గత ఏడాది విడుదల చేసిన వన్ ఎం9 మాదిరిగానే వన్ ఎస్9 ఫీచర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ స్మార్ట్ ఫోను ఐదు అంగుళాల టచ్ స్క్రీన్, 2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 13 మెగాపిక్సిల్ రేర్ కెమెరా, 4 మెగాపిక్సిల్ ఫ్రంట్ కెమెరా, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 6.0, 2840 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగివుంది.