Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్యకు ప్రతిచర్య : గూఢచర్యం ఆరోపణలపై భారత్ దౌత్యాధికారిని బహిష్కరించిన పాక్

పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. గూఢచర్యం కేసులో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో పని చేసే దౌత్య సిబ్బందిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. ఆ తర్వాత ఇదే ఆరోపణల కింద పాకిస్థాన్ భారత దౌత్యాధికారిని

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:53 IST)
పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. గూఢచర్యం కేసులో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో పని చేసే దౌత్య సిబ్బందిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. ఆ తర్వాత ఇదే ఆరోపణల కింద పాకిస్థాన్ భారత దౌత్యాధికారిని తమ దేశం వీడి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. 
 
న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఆఫీసులో పనిచేస్తున్న మహ్మూద్ అఖ్తర్ (35)ను 48 గంటల్లోగా దేశం విడిచి పోవాలని భారత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ నుంచి వచ్చిన ఇద్దరిని ఢిల్లీ జూపార్కు వద్ద కలుసుకున్న ఆయన, సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారమున్న పత్రాలను స్వీకరిస్తుంటే పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆయనను దేశం వీడి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. 
 
ఈ వార్త వెలువడిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌లోని భారత కాన్సులేట్‌లో పనిచేస్తున్న సుర్జీత్ సింగ్‌పై వేటు వేసింది. శుక్రవారం సాయంత్రంలోగా సుర్జీత్ తన కుటుంబంతో సహా దేశాన్ని విడిచిపోవాలని ఆదేశించింది. వియన్నా సదస్సు నిర్ణయాలు, ద్వైపాక్షిక నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని చెబుతూ భారత హై కమిషనర్‌కు సమన్లు పంపింది. ఆయన్ను వెంటనే ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

dubai: టాలీవుడ్ ప్రముఖులు తరచూ దుబాయ్ వెళ్ళేది అందుకేనా ?

Prabhudeva: ప్రభుదేవా కంటిన్యుటీ కొడుకు రిషి రాఘవేంద్ర వచ్చేస్తున్నాడు

ప్రముఖ నేపథ్యగాయకుడు యేసుదాస్ ఆస్పత్రిలో అడ్మిట్

Shruti Haasan: ది ఐ లాంటి కాన్సెప్ట్‌ లంటే చాలా ఇష్టం

ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ సినిమా తల్వార్ లో నటుడిగా పూరి జగన్నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments