Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయులారా స్వదేశానికి వచ్చేయండి: కేంద్రం

భారతీయులారా స్వదేశానికి వచ్చేయండి: కేంద్రం
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (22:49 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల పట్ల భారత కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘన్‌ను వీడాలని భారత ప్రభుత్వం చెబుతోంది. 
 
ఆఫ్ఘన్‌లో హింస క్రమంగా పెచ్చరిల్లుతోందని, త్వరలోనే విమాన సర్వీసులు నిలిచిపోవచ్చని, ఆలోపే భారత పౌరులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
ఆఫ్ఘనిస్థాన్‌లోని చాలా ప్రాంతాలను తాలిబాన్లు స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ఉన్న భారతీయులను కూడా టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకనే భారత ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్లను తిరిగి వచ్చేయాల్సిందిగా కోరుతూ ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 1,461 మందికి కరోనా పాజిటివ్‌.. సరికొత్త మార్గదర్శకాలు విడుదల