Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆప్ఘనిస్తాన్‌లో సైనిక దాడులు .. 141 మంది తీవ్రవాదుల హతం!

ఆప్ఘనిస్తాన్‌లో సైనిక దాడులు .. 141 మంది తీవ్రవాదుల హతం!
, శనివారం, 20 డిశెంబరు 2014 (16:26 IST)
పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ తీవ్రవాదులు సృష్టించిన మారణహోమం ఇపుడు తీవ్రవాదుల పాలిట యమపాశంగా మారింది. ఆప్ఘనిస్థాన్‌లో గత 48 గంటల్లో పాక్, ఆప్ఘనిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు 141 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. 
 
ముఖ్యంగా... ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాలైన కునార్, ఉరుంగజ్, బాల్క్, హెల్మాండ్, ఘంజీ, నాన్ గార్హర్ తదితర ప్రాంతాల్లో దాడులు కొనసాగినట్టు ఆఫ్ఘాన్ రక్షణ శాఖ వెల్లడించింది. దాడుల సమయంలో తాలిబన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైందని తెలిపింది. భారీ ఆయుధాలు, బాంబులతో తాలిబన్లు ఎదురు దాడికి దిగారని చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu