శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్లైన్ బుకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. శబరిమలలో నవంబరు 16వ తేది మండల పూజ ప్రారంభమవుతుంది. స్వామి దర్శనం కోసం ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం ఉన్న విషయం తెలిసింది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు భక్తులు సంబంధిత వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చును.
ఆ వెబ్సైట్లో భక్తులు తమ పేరు, చిరునామా, ఫోటోను జత చేసి వర్చువల్ క్వ్యూ కార్డును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రిజిస్టర్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుని సూచించిన టైం కంటే అర గంట ముందుగా పంబకు వెళ్లినట్లైతే అక్కడ ఉన్న ప్రత్యేక కేంద్రంలో అధికారులు పరిశీలించి కొండపైకి ఎక్కేందుకు అనుమతిస్తారు.
ఈ విధానం ద్వారా ఒక గంట సేపటిలో ఆలయానికి చేరుకుని 18 మెట్లు ఎక్కి, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చును. ఈ సేవ నవంబర్ 16వ తేది నుంచి డిసెంబర్ 27వ తేది వరకు అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యం 2015 జనవరి నెలల జరిగే మకర దీప పూజ వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.