రామ్ చరణ్ 'గోవిందుడు అందరి వాడేలే'కి యువన్ మ్యూజిక్!
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (12:38 IST)
మెగాపవర్స్టార్ రామ్ చరణ్, కాజల్ జోడిగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో, శివబాబు బండ్ల సమర్పణలో, పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తోన్న తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. ఇటీవలె ఈ సినిమా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుని హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ను హైదరాబాద్లో ఏప్రిల్ 21నుంచి ప్రారంభం కానుంది.అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్నందించనున్నారని వార్తలు వచ్చాయి. సంగీతం అభిరుచి కలిగిన కృష్ణవంశీ, తమన్ కాంబినేషన్లో ఈ సినిమా సాంగ్స్ సంచలనం సృష్టించడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ఆ సినిమాకు ఇప్పుడు యువన్శంకర్రాజా సంగీత దర్శకునిగా తీసుకున్నట్లు తెలిసింది. యువన్ తెలుగులో 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే', 'దూసుకెళ్తా' తదితర చిత్రాలకు సంగీతం అందించారు.