స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గోల్డెన్లెగ్ బ్యూటీ శృతిహాసన్ నటించిన 'రేసుగుర్రం' విడుదలై సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. వరుస సినిమాల్లో నిరాశ ఎదుర్కొన్న బన్నీకి ఈ సినిమాతో కొంత ఉపశమనం లభించినట్లుయింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ. 6.3 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ వీకెండ్లో మినిమం 15కోట్లు వస్తాయని సినీపండితులు చెబుతున్నారు. ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపించాడు.రాజమౌళి: సురేందర్ రెడ్డి గారికి, బుజ్జిగారికి, బన్నీకి నా అభినందనలు. 'రేసుగుర్రం' చిత్ర యూనిట్కు కూడా కంగ్రాట్యులేషన్స్. చాలా మంచి సినిమా తీశారు. ఇంటర్వెల్లో వచ్చే సన్నీవేశాల్లో శృతిహాసన్ తనలోపల ఫీలింగ్స్ని చాలా అద్భుతంగా ప్రదర్శించింది. అలాగే బన్నీ 'దేవుడా..' అనే ఊతపదం బాగా క్లిక్కయింది. కిల్ బిల్ పాండేగా బ్రహ్మానందం అదరగొట్టేశాడు.