Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగష్టులో శర్వానంద్- నిత్యా మీనన్‌ల సినిమా!

ఆగష్టులో శర్వానంద్- నిత్యా మీనన్‌ల సినిమా!
, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2014 (09:56 IST)
FILE
కుర్ర హీరో శర్వానంద్, బబ్లీ గర్ల్ నిత్యామీనన్ జంటగా కొత్త సినిమా ప్రారంభమయింది. బుధవారం ఈ సినిమా ముహూర్తం జరుపుకుంది. నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించే ఈ మూవీని "ఓనమాలు" ఫేం క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో కె.ఎస్. రామారావు- కె.ఎ. వల్లభనేని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా మారుతి నిర్వహణలో "లవ్ యు బంగారమ్" మూవీతో విమర్శలు ఎదుర్కున్న సీనియర్ నిర్మాత రామారావు ఫీల్ ఉన్న సినిమా నిర్మిస్తున్నారని టాక్.

ఇది "బొంబాయి" లాంటి ప్రేమకథ, "కృష్ణంవందే జగద్గురుం" ఫేం సాయి మాధవ్ డైలాగ్స్ అదిరాయి అని నిత్యా మీనన్ అంటోంది. 'చంటి', 'మాతృదేవోభవ' చిత్రాలతో ఆడియన్స్‌కు దగ్గర చేసిన రామారావు బ్యానర్‌లో మరో మంచి క్యారెక్టర్ చేస్తున్నా అని నాజర్ అన్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆగస్ట్‌లో విడుదల చేస్తామని యూనిట్ స్పష్టం చేసింది. సినిమా ప్రారంభోత్సవానికి యూనిట్ సహ పీవీపి ప్రొడక్షన్స్ అధినేత పొట్లూరి వరప్రసాద్, బీజేపి నేత రఘురామ రాజులు కూడా హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu