ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 ఛాంపియన్ కోల్కాతా నైట్రైడర్స్ ఛాంపియన్స్ లీగ్ టీ20లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ టోర్నీలో గంభీర్ సేన వరుసగా రెండో విజయంతో సెమీస్కు చేరువైంది.
కోల్కతా కెప్టెన్ గంభీర్ (60)తోపాటు రాబిన్ ఉతప్ప (46) రాణించడంతో.. కోల్కాతా 4 వికెట్ల తేడాతో లాహోర్ లయన్స్ను ఘన విజయం సాధించింది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్లో తొలుత.. లాహోర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది.
షెజాద్ (59), ఉమర్ అక్మల్ (40) ఆదుకున్నారు. సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత లాహోర్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని కోల్కాతా 6 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. నరైన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.