సొంత మైదానం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భారత్తో తలపడే ఆస్ట్రేలియాకు విజయం అంత సులభం కాబోదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ 2015 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనే అంశంపై ఆస్ట్రేలియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని చెప్పుకొచ్చాడు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ సెమీస్లో టీమిండియా స్పిన్ను ఏ మేరకు ఎదుర్కొంటుందన్న దానిపైనే ఆసీస్ విజయం ఆధారపడి ఉంటుందని అతడు వ్యాఖ్యానించాడు. ఇకపోతే.. టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీపై వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. వరల్డ్ కప్లో విజయాలు ఎలా సాధించాలో ధోనీకి బాగా తెలుసన్న వాన్, టీమిండియాను ధోనీ మలిచిన తీరు అద్భుతమంటూ కీర్తించాడు.
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ల తర్వాత టీమిండియాను ధోనీ దుర్బేధ్యంగా మలిచాడని వాన్ పేర్కొన్నాడు. ఆ కారణంగానే వరల్డ్ కప్లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తోందని వ్యాఖ్యానించాడు. తనదైన టెక్నిక్తో రాణిస్తున్న భారత బ్యాట్స్ మన్ అజింక్యా రెహానే, భవిష్యత్లో టీమిండియా బ్యాటింగ్కు వెన్నెముకలా మారతాడని వాన్ చెప్పాడు.