Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న వైఎస్ భౌతిక కాయం

క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న వైఎస్ భౌతిక కాయం
కర్నూలు నుంచి వైఎస్ భౌతిక కాయాన్ని హెలికాప్టర్‌లో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. విమానాశ్రయంలో వైఎస్ భౌతిక కాయాన్ని దర్శించేందుకు క్యాబినెట్ సహచరులు, ప్రముఖ ఎమ్మెల్యేలు తరలి వెళ్ళినట్లు సమాచారం.

వైఎస్ భౌతిక కాయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే అక్కడి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేస్తారు. అక్కడ సందర్శకులను అనుమతించాలా వద్దా అనేదానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.

కాగా వైఎస్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్‌లోని లాల్ బహాదుర్ స్టేడియంలో ఉంచి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలనుంచి అనుమతిస్తారని అధికారులు పేర్కొన్నారు.

కడసారిగా ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ భౌతిక కాయాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu