Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెసరపప్పుతో కారంచెక్కలు

పెసరపప్పుతో కారంచెక్కలు
కావలసిన పదార్థాలు :
బియ్యపు పిండి... ఒక కిలో
పెసరపప్పు... పావు కిలో (పొట్టు లేనివి)
డాల్డా లేదా వెన్న... 200 గ్రాములు
అల్లం... 50 గ్రాములు
పచ్చి మిరపకాయలు... ఆరు
జీలకర్ర... ఒక టేబుల్ స్పూన్
ఉప్పు... తగినంత
నూనె... ముప్పావు కిలో

తయారీ విధానం :
బియ్యం పిండిని ముందుగా జల్లించుకోవాలి. పెసర పప్పును ఒక గంట నానబెట్టాలి. అల్లం, మిరపకాయలను మెత్తని పేస్టులా చేసుకోవాలి. బియ్యపు పిండిలో నానిన పెసర పప్పును, అల్లం పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని, డాల్డాను, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి.

తరువాత పిండిని నాలుగు సమాన భాగాలుగా చేసుకుని... ఒక్కో భాగాన్ని నీళ్ళతో తడుపుతూ చెక్కలను తయారు చేసుకోవాలి. వీటిని బాగా కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా కాల్చి తీసేయాలి. అంతే పెసరపప్పుతో కారంచెక్కలు రెడీ అయినట్లే...!

పిండిని ఎప్పటికప్పుడు కలుపుకుని చెక్కలు చేస్తే అవి బాగా గుల్లగా వస్తాయి. పూరీ చెక్క మీద పాలిథిన్ పేపర్ వేసి ఎప్పటికప్పుడు ఆ కాగితానికి కొంచెం నూనె రాసుకుని చెక్కలను తయారు చేసుకున్నట్లయిచే త్వరగా చేయవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu