తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పెట్టుబడులకు ఊతమిచ్చే విధంగా వుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం వార్షిక బడ్జెట్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రుణ సదుపాయాల కల్పనపై బడ్జెట్ కసరత్తులో ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు ఆయన వివరించారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే కారకాల్లో రుణ సదుపాయం ఒకటిగా ఆయన పేర్కొన్నారు.
ఇందులోభాగంగానే 60 వేల కోట్ల రూపాయల విలువ గల వ్యవసాయ రుణాలను మాఫీ చేసినట్టు చిదంబరం వివరించారు. ఈ రుణాల మాఫీ వల్ల చిన్న, సన్నకారు రైతులు సంపూర్తిగా లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. అలాగే ఈ పెట్టుబడులను సృష్టించడమే కాకుండా వృద్ధికి దారితీసి దేశ సౌభాగ్యానికి శ్రీకారం చుడుతుందని ఆయన చిదంబరం అభిప్రాయపడ్డారు.