Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎస్ దంపతుల కుమార్తెను పురుషుడిగా మార్చేశారు.. ఎలా?

ఐపీఎస్ దంపతుల కుమార్తెను పురుషుడిగా మార్చేశారు.. ఎలా?
, సోమవారం, 29 ఆగస్టు 2022 (14:46 IST)
ఒడిశా రాష్ట్రంలో ఓ అరుదైన కేసు ఒకటి వెలుగు చూసింది. ఐపీఎస్ దంపతులు తమ కుమార్తెకు లింగ మార్పిడి చికిత్స చేయించారు. అంటే, అమ్మాయిని అబ్బాయిగా మార్చారు. ఒడిశాకు చెందిన ఈ ఐపీఎస్ దంపతుల సమ్మతితో 22 యేళ్ళ కుమార్తెకు ఈ లింగ మార్పిడి శస్త్రచికిత్స (సెక్స్ రీ అసైన్‌మెంట్ సర్జరీ)ని విజయవంతంగా పూర్తి చేశారు. 
 
ఈ అరుదైన కేసు గురించి ఐపీఎస్ దంపతుల కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. ఈ లింగమార్పిడి ఆపరేషన్ ఇటీవల ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత డాక్యుమెంట్లు, పాస్‌పోర్టు‌లోనూ లింగమార్పిడి కోసం చర్యలు చేపట్టారు. అయితే, ఈ ఆపరేషన్ ఎపుడో జరిగింది. పైగా, లింగ మార్పిడి చేయించుకున్న యువతి ప్రస్తుతం అమెరికాలో మేనేజ్మెంట్ స్టడీస్ చేస్తోంది. 
 
ఈ సర్జరీ తర్వాత పూర్తిగా పురుష హార్మోన్లు అభివృద్ధి చెందడానికి కనీసం రెండేళ్ళ సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. "లింగమార్పడి చికిత్స చేయించుకున్న వారు జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ (జీఐడీ)ను ఎదుర్కొంటారు. మహిళ పురుషుడిగా ప్రవర్తించవచ్చు. అయినా కానీ మహిళా క్రోమోజోముల కారణంగా పురుషల పట్ల ఆకర్షణ కొనసాగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ లింగ మార్పిడి విధానంలో పురుషుడిని మహిళగా మార్చడం కంటే.. మహిళను పురుషుడుగా మార్చడం సులభతరమని వైద్యులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలన్ మస్క్ తల్లి.. అలా గ్యారేజ్‌లోనే నిద్రపోయిందా?