దువ్వాసిమోహన్, భువనేశ్వరి ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న చిత్రం కుర్కురే. అంతా కిరికిరే అన్నది ఈ చిత్రం కాప్షన్. శివ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై దువ్వాసి మోహన్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జునైద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 11న ప్రేక్షకుల ముందుకు తేవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.
ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోదభరితంగా దర్శకుడు తెరకెక్కించారని అన్నారు. ఈ చిత్రం ద్వారా ఇంద్ర విలన్గా పరిచయమవుతున్నారని దర్శకుడు అన్నారు. ఇంకా ఈ చిత్రంలో భువనేశ్వరి పాత్ర హైలెట్గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రం ద్వారా దువ్వాసి మోహన్ హీరోగా రిచయమవుతున్నారని ఆయన తెలిపారు. దువ్వాసి మోహన్ బాడీ లాంగ్వేజ్కు తగ్గ పాత్రను ఇందులో ఆయన పోషించారని ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైయిలర్ రూపంలో మీ కోసం...