Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముగ్గురు హీరోయిన్లతో "వ్యాపారి" రొమాన్స్

ముగ్గురు హీరోయిన్లతో
ఖుషి, కొమరంపులి దర్శకుడు ఎస్.జె. సూర్యా ద్విపాత్రాభినయం చేసిన "వ్యాపారి" చిత్రం ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది.

సెక్సీతారలు తమన్నా, నమిత, మాళవికలు "వ్యాపారి" చిత్రంలో అందాలను ఆరబోశారని ఇండస్ట్రీలో టాక్.

విభిన్న కథాంశంతో రూపొందించబడి తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని "వ్యాపారి" పేరుతో ప్రణతి క్రియేషన్స్‌ తెలుగులో అనువదిస్తోంది. కూనిరెడ్డి శ్రీనివాస్‌ ఈ చిత్రానికి నిర్మాత.

సెన్సార్‌ ప్రశంసలు పొందిన ఈ చిత్రాన్ని ఈనెల 11వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నాజర్‌ సైంటిస్ట్‌గా నటించారు. ఎస్.జె. సూర్య నటన, నమిత, మాళవిక, తమన్నాలతో ఆయన చేసే రొమాన్స్ మాస్‌ను ఆకట్టుకుంటుందని నిర్మాత చెప్పారు.

గ్లామర్ మాత్రమే గాకుండా సెంటిమెంట్‌కు కూడా పెద్దపీట వేసిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ పాత్ర హైలైట్‌గా ఉంటుందని నిర్మాత వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా "వ్యాపారి"ని 50 ప్రింట్లతో విడుదలచేస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu