Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్తాన్‌లో సల్మాన్ ఖాన్ సినిమా చూసి ఏడుస్తున్నారు... ఎందుకు...?

పాకిస్తాన్‌లో సల్మాన్ ఖాన్ సినిమా చూసి ఏడుస్తున్నారు... ఎందుకు...?
, బుధవారం, 29 జులై 2015 (21:08 IST)
సల్మాన్ ఖాన్ హీరోగా, కరీనా కపూర్ హీరోయిన్‌గా బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ సహకారంతో తెరకెక్కిన భజరంగీ భాయ్ జాన్ చిత్రాన్ని పాకిస్తాన్ దేశంలో చూస్తున్న ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు ఏడుస్తూ వస్తున్నారట. ఈ విషయాన్ని పాకిస్తాన్ లోని ఓ థియేటర్ యజమాని చెప్పుకొచ్చారు.
 
లాహోర్ నగరంలో తను ఏడేళ్లుగా సినిమా థియేటర్ నడుపుతున్నానని చెప్పిన ఆయన తను గతంలో ఎప్పుడూ ఇలా చూడనే లేదని అన్నారు. భజరంగీ భాయ్ జాన్ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ రోజురోజుకీ పెరుగుతూ ఉందని, ఇలాంటి స్పందన తను గతంలో, అంటే ఏడేళ్ల కాలంలో చూడనే లేదన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా థియేటర్‌కు ప్రేక్షకులు క్యూ కడుతున్నారనీ, యువత అయితే మళ్లీమళ్లీ చూస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం వారం రోజుల క్రితం విడుదలైనా ఇంకా ఆదరణ తగ్గలేదని వెల్లడించాడు.

Share this Story:

Follow Webdunia telugu