బుల్లితెర నటి శ్రీవాణి అప్పుడు కొట్టిందంటూ... ఇప్పుడు ఏం చేసిందో తెలుసా?
బుల్లితెర నటి శ్రీవాణి మరో వివాదంలో చిక్కుకుంది. తన వదినను కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీవాణి తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... శ్రీవాణి భర్త విక్రమాదిత్య కెవ్వు కబడ్డి అ
బుల్లితెర నటి శ్రీవాణి మరో వివాదంలో చిక్కుకుంది. తన వదినను కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీవాణి తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... శ్రీవాణి భర్త విక్రమాదిత్య కెవ్వు కబడ్డి అనే షోను జెమినీ టీవీలో చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా టీవీ నటులు పాల్గొంటున్నారు. కాగా కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా నటి కవిత వ్యవహరిస్తున్నారు.
రోజుకు రూ. 25 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 7 రోజులకు గాను రూ. 75 వేలు చెల్లించి మిగిలినది చెక్ రూపంలో ఇచ్చారు. కవిత ఆ డబ్బును బ్యాంకుకు వెళ్లి మార్చుకునేసరికి స్టాప్ పేమెంట్ పెట్టేసారు. దీనిపై కవిత మండిపడుతోంది. ఈ విషయంపైన ఇద్దరి మధ్య మాటల తూటాల పేలుతున్నాయి.