త్రివిక్రమ్-నాగచైతన్య కాంబినేషన్లో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో మెగా హీరోలచే హిట్ కొట్టిన త్రివిక్రమ్.. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీపై పడ్డాడు. ఏ మాయ చేసావె ద్వారా మంచి పేరు సంపాదించుకుని మాస్ హీరోగా ముద్రవేసుకున్న నాగచైతన్యతో కలిసి సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు. ఇందుకు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకునే ఈ మూవీకి ఎస్. రాధాకృష్ణ నిర్మాణ సారథ్యం వహించనున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్పై ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను జూలై 11వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది.
నాగచైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో బిజీ బిజీగా ఉన్నాడు. అలాగే కార్తీకేయ ఫేమ్ చందూతో నాగచైతన్య మూవీ వుండటంతో ఈ రెండు ప్రాజెక్టులు సిద్ధమయ్యాక నాగ చైతన్యతో త్రివిక్రమ్ సినిమా సినిమా చేస్తాడని తెలుస్తోంది. అంతలోపు త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటారని తెలిసింది.