Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మనం'లో చేయలేదనే బాధ వుంది : సుశాంత్

అక్కినేని కుటుంబంలోని మూడు తరాలు నటించిన సినిమా 'మనం'. ఇందులో ఇంకా కొందరు నటించాలని అనుకున్నా కుదరలేదట. ముఖ్యంగా సుమంత్‌ ఉంటాడని భావించారు.

'మనం'లో చేయలేదనే బాధ వుంది : సుశాంత్
, మంగళవారం, 16 ఆగస్టు 2016 (15:53 IST)
అక్కినేని కుటుంబంలోని మూడు తరాలు నటించిన సినిమా 'మనం'. ఇందులో ఇంకా కొందరు నటించాలని అనుకున్నా కుదరలేదట. ముఖ్యంగా సుమంత్‌ ఉంటాడని భావించారు. కానీ ఇప్పుడు సుశాంత్‌ తానే ఉండాల్సింది కానీ.. అప్పడు తాతయ్య ఉన్నప్పుడు అందులో నటించే ఛాన్స్‌ రాలేదు. చేయలేదనే బాధ వుంది. అయితే ఆ బాధ ఇప్పుడు తీరింది అంటూ తెలియజేస్తున్నాడు. 
 
సుశాంత్‌ నటించిన సినిమా 'ఆటాడుకుందాం రా'. ఈ సినిమాలో ప్రత్యేకత ఏమంటే.. అఖిల్‌, నాగ చైతన్య కూడా నటించడం. అఖిల్‌.. చైల్డ్‌ ఆర్టిస్టుగా చేసిన 'సిసింద్రీ'లో ఆటాడుకుందాం. అనే పాట వుంది. దాన్నే టైటిల్‌గా ఈ సినిమాకు పెట్టాడు. అందుకే టైటిల్‌సాంగ్‌లో అఖిల్‌ ప్రత్యక్షమవుతాడు. 
 
ఇక నాగచైతన్య.. అయితే కథలో భాగం.. తన పాత్ర కథను మలుపు తిప్పుతుందట.. ఈ విషయాన్ని సుశాంత్‌ వెల్లడించారు. ఇద్దరు హీరోలతో కలిసి మల్టీస్టారర్‌గా నటించే ఛాన్స్‌ రావడం.. అదృష్టంగా భావిస్తున్నాననీ.. ఇది నాకు చాలా సంతృఫ్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ సినిమా ఈనెల 19న విడుదలకానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సక్సెస్‌లు మన చేతుల్లో లేవు: విక్రమ్‌